Bendapudi Students: ఇంగ్లీష్లో చించేశారు.. సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు.. చివరికి ఏమైందంటే..
కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడికి చెందిన కొంత మంది టెన్త్ క్లాస్ విద్యార్ధులు ఇటీవల సీఎం కలిశారు. మేఘన, రిష్మా అనే విద్యార్ధులు అమెరికన్ శ్లాంగ్లో ఇంగ్లీష్ మాట్లాడారు...
కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడికి చెందిన కొంత మంది టెన్త్ క్లాస్ విద్యార్ధులు ఇటీవల సీఎం కలిశారు. మేఘన, రిష్మా అనే విద్యార్ధులు అమెరికన్ శ్లాంగ్లో ఇంగ్లీష్ మాట్లాడారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వాళ్ల మీద విపరీతంగా ట్రోల్ జరిగాయి. ఫలితాల్లో ఫెయిల్ అయ్యారంటూ ట్రోల్స్ వచ్చాయి. కానీ వాస్తవానికి వాళ్లు ఫస్ట్ క్లాస్లో టెన్త్ పాస్ అయ్యారు. వీటికి చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్ స్పందించారు. మేఘన, రిష్మాలను చదివించేందుకు ముందుకు వచ్చారాయన. ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ చదువుకున్నా.. వాళ్లకు అయ్యే ఖర్చు తానే భరిస్తానంటూ హామీ ఇచ్చారు. జూమ్ యాప్ ద్వారా విద్యార్ధులతో మాట్లాడారు పంచ్ ప్రభాకర్. టీవీ9 ఎఫెక్ట్తోనే తమకు ఈ అవకాశం వచ్చిందంటున్నారు విద్యార్ధిని మేఘన.
అంతే కాకుండా బెండపూడి స్కూల్ ను ఇంగ్లీష్ హబ్ కేంద్రంగా తీర్చి దిద్దేందుకు పదిలక్షల రూపాయల విరాళం ప్రకటించారు. విద్యార్ధుల ప్రతిభకు కారణమైన ఇంగ్లీష్ మాస్టర్ ప్రసాద్ను, విద్యార్థులను సన్మానించి ఆర్థిక సాయం అందచేశారు. గుంటూరు నుంచి వెళ్లిన పంచ్ ప్రభాకర్ టీమ్.. విద్యార్ధులతో పాటు వారి తల్రిదండ్రులను కలిసి మాట్లాడారు. దీంతో ఆ విద్యార్ధులు ఆనందంతో పొంగిపోతున్నారు.