AP High Court: కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు.. స్వయంగా విచారణకు హాజరవ్వాలంటూ ఆ ఇద్దరికీ నోటీసులు..
పోలీసు శాఖలో ప్రమోషన్ల అంశమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్వయంగా కోర్టుకు హాజవ్వాలంటూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్,
AP High Court: పోలీసు శాఖలో ప్రమోషన్ల అంశమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్వయంగా కోర్టుకు హాజవ్వాలంటూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్కు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. జనవరి 25వ తేదీన హైకోర్టుకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఏలూరు పరిధిలో ఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్న యు. రామారావుకు సీఐగా ప్రమోషన్ కల్పించే ప్యా్నల్లో స్థానం కల్పించాలని హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను రాష్ట్ర హోంశాఖ అధికారులు అమలు చేయలేదు. దాంతో రామారావు కోర్టు ధిక్కరణ కింద మరోసారి పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. డీజీపీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఏలూరు రేంజ్ ఐజీ లకు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. అయితే, తాజాగా మరోసారి ఈ కేసు హైకోర్టు విచారణకు వచ్చింది. డీఐజీ తరఫున న్యాయవాది విచారణకు హాజరవగా, డీజీపీ, హోంశాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరఫున ఎవరూ హాజరుకాలేదు. దాంతో హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Also read:
రజినీ నిర్ణయంపై స్పందించిన ఆయన సోదరుడు.. పార్టీ ఏర్పాటు విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు..
Farmers Protest : తగ్గుతుందా? ఒత్తిడికి తలొగ్గుతుందా? ఈ రోజు ఢిల్లీలో ఇదే హాట్ టాపిక్..