విశాఖ ఘటనపై ఏపీ గరవ్నర్ బిశ్వభూషన్ దిగ్భ్రాంతి
విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై ఏపీ గరవ్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడం, అధిక సంఖ్యలో ఆసుప్రతిపాలు కావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు..
విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై ఏపీ గరవ్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడం, అధిక సంఖ్యలో ఆసుప్రతిపాలు కావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు గరవ్నర్. అలాగే తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని రెడ్క్రాస్కు ఆదేశాలు జారీ చేశారు. ఆర్ ఆర్ వెంకటాపురంలో దుర్ఘటన బాధాకరమని, మనుషులే కాదు మూగజీవాలు మృతిచెందాయని.. కొన ఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను కాపాడాలని ఆయన అన్నారు.
కాగా విశాఖలో ఫార్మా కంపెనీ ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీశారు. గ్యాస్ లీక్ ప్రమాద ఘటన వివరాలు కలెక్టర్ని అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో జగన్ వైజాగ్ వెళ్లనున్నారు. 11.45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఆయన వైజాగ్ వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు.
Read More:
మీ అకౌంట్లో రూ.1500 పడలేదా? అయితే ఈ నెంబర్కి కాల్ చేయండి!
హీరోయిన్ తండ్రిని కత్తితో బెదిరించి.. ఫోన్ లాక్కెళ్లిన దొంగలు