AP Government: ఉన్నత విద్యలో నూతన కోర్సులు.. రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
ఆధునిక సమాజం, వివిధ పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా ఉన్నత విద్యలో కొత్త కోర్సుల రూపకల్పనపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఉన్నత విద్యలో కొత్త కోర్సుల రూపకల్పన...
AP Government: ఆధునిక సమాజం, వివిధ పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా ఉన్నత విద్యలో కొత్త కోర్సుల రూపకల్పనపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఉన్నత విద్యలో కొత్త కోర్సుల రూపకల్పన, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ సంస్థలకు ఉపకరించే కోర్సులపై కార్యాచరణ షురూ చేసింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు వెలువరించారు.
ఈ కమిటీ ఆధునిక సమాజం, వివిధ పరిశ్రమలకు అవసరమయ్యే కొత్త కోర్సుల ఏర్పాటుపై పరిశీలనలు జరిపి కసరత్తు చేయాల్సి ఉంది. ప్రణాళిక బోర్డు నిర్వహణకు అవసరమయ్యే నిధులను విడుదల చేసేందుకు సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
Also Read:
Janasena Party: తిరుపతి ఉపపోరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..