Ap Corona Updates: ఏపీలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు.. మరణాలు ఎన్ని అంటే..
Ap Corona Updates: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి లాక్డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు చేయడం వల్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం..
Ap Corona Updates: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి లాక్డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు చేయడం వల్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా అన్ని రంగాలు తెరుచుకుని తమ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో నిన్నటి కంటే ఈ రోజు పాజిటివ్ కేసులు పెరిగాయి. నిన్న 1002 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 58,890 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1248 పాజిటివ్ కేసులు బయట పడ్డాయి. ఇక తాజాగా 15 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 2.1శాతం ఉండగా, మరణాల రేటు 0.68 శాతం ఉంది.
తాజాగా చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, కర్నూలు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మొత్తం 15 మంది మరణించారు.
అలాగే అత్యధిక పాజిటివ్ కేసులు చిత్తూరు జిల్లాలో 166 నమోదు అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 13677 ఉండగా, గడిచిన 24 గంటల్లో 1715 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13750 మృతి చెందారు. ఇక మొత్తం రికవరీ కేసులు 19.77 లక్షల మంది ఉన్నారు. రివకరీ శాతం 98.5 శాతం ఉంది.
కాగా, దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి అదుపులోకి వచ్చినట్లే కన్పిస్తోంది. క్రియాశీల రేటు తగ్గడం.. రికవరీ రేటు మెరుగ్గా ఉండటం కొంత ఊరటనిస్తోంది. యాక్టివ్ కేసుల రేటు 1శాతం దిగువకు పడిపోయింది. అటు కొత్త కేసులు కూడా భారీగా తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య దాదాపు 50 శాతం ఎక్కువగా ఉంది.
దేశంలో కొత్తగా 25,467 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.24కోట్లకు చేరింది. ఇదే సమయంలో మరో 39,486 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.17కోట్ల మంది వైరస్ను జయించగా.. రికవరీ రేటు 97.68శాతానికి పెరిగింది.
కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో యాక్టివ్ కేసులు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,19,551 మంది వైరస్తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 0.98 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 354 మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో 4,35,110 మందిని కరోనా బలితీసుకుంది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. సోమవారం 63,85,298 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 58.89 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
#COVIDUpdates: 24/08/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,01,695 పాజిటివ్ కేసు లకు గాను *19,74,268 మంది డిశ్చార్జ్ కాగా *13,750 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 13,677#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/v2tZcDzquM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 24, 2021