మాచర్లకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి .. పింగళి వెంకయ్య కుటుంబానికి సన్మానం..
జాతీయపతాకం రూపొందించి ఈనెలాఖరుకు నూరేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబసభ్యులను సత్కారించాలని ఏపీ ప్రభుత్వం..
AP CM Jagan Tour Guntur: జాతీయపతాకం రూపొందించి ఈనెలాఖరుకు నూరేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబసభ్యులను సత్కారించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు జిల్లా మాచర్లలో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. జాతీయ పతాకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తవుతున్న సందర్బంగా త్రివర్ణ పతాకం రూపశిలపి పింగళి వెంకయ్య ఫ్యామిలీని సీఎం సత్కారించనున్నారు.
పింగళివెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మిని సన్మానించనున్నారు. ప్రస్తుతం సీతామహాలక్ష్మి వయస్సు 99 ఏళ్లు. మాచర్లలోని పిడబ్ల్యూడీ కాలనీకి వెళ్లే దారిలోని సుద్దగుంతల నివాసానికి సీఎం జగన్ వెళ్లనున్నారు. శుక్రవారం 11 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా మాచర్లకు సీఎం చేరుకుంటారు.
12 గంటలకు పింగళి వెంకయ్య కుటుంబసభ్యులను ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులను సన్మానిస్తారు. కోట్లాది ప్రజలు వందనాలు స్వీకరించే త్రివర్ణ పతాక రూపశిల్పి అయిన పింగళి వెంకయ్య కుమార్తెగా గుర్తింపు ఇచ్చినందుకు సీతామహాలక్ష్మి కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు.