CM YS Jagan: ఆర్టీసీ కార్మికులకు అదిరిపోయే శుభవార్త తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త వినిపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఏపీపీటీడీగా మార్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం ఈ..
CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త వినిపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఏపీపీటీడీగా మార్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కార్మికులుగానే ఉన్న వీరికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభించనుంది. అంతేకాకుండా మరో నిర్ణయం కూడా తీసుకున్నారు సీఎం జగన్. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త పీఆర్సీని అమలు చేస్తామని ప్రకటించారు. దీంతో ఉద్యోగుల్లో ఆనందం విల్లివిరుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అక్టోబర్ 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులందరికీ పీఆర్సీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. నెల్లూరు రీజియన్లో నెల్లూరు 1,2 రావూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావాలి, కందుకూరు డిపోల్లో 2,951 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరితోపాటు ఆర్ఎం కార్యాలయంలోని 60 మంది ఉద్యోగులతో పాటు మొత్తం 3,011 మందికి కొత్త పీఆర్సీ ప్రకారం వచ్చే నెల నుంచి కొత్త వేతనాలు అందనున్నాయి. దీంతో ఉద్యోగుల స్థాయిని బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు అదనంగా వేతనాలు పెరగనున్నాయి.
అయితే వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఆర్టీసీ కార్మికులు కలిసి పరిస్థితిని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఏపీపీడీడీగా మార్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి