AP Coronavirus: ఏపీలో భారీగా తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..
AP Coronavirus: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కరోనా కట్టడికి ఆయా రాష్ట్రాలు లాక్డౌన్, ఇతర ఆంక్షలు , వ్యాక్సినేషన్ వంటివి చేపట్టడంతో..
AP Coronavirus: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కరోనా కట్టడికి ఆయా రాష్ట్రాలు లాక్డౌన్, ఇతర ఆంక్షలు , వ్యాక్సినేషన్ వంటివి చేపట్టడంతో ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ ఏపీలోనూ కేసులు భారీగానే తగ్గుతున్నాయి. ఏపీ సర్కార్ కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టింది. ఇక తాజాగా కరోనా హెల్త్బులిటెన్ (Corona Health Bulletin) విడుదల చేసింది ఏపీ ఆరోగ్యశాఖ. గడిచిన 24 గంటల్లో 18,803 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 244 మందికి కరోనా(Corona) ఉన్నట్లు తేలింది. ఇక తాజాగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. గడిచిన 24 గంటల్లో 662 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,30,10,692 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2316711 ఉండగా, మరణాల సంఖ్య 14,716కు చేరింది. ఇక యాక్టివ్ కేసులు 5565 ఉండగా, రికవరీ అయిన వారి సంఖ్య 2,293,535 ఉంది. కాగా, కరోనాను అంతం చేసేందుకు ఏపీ సర్కార్ చర్యలు చేపడుతోంది. మాస్క్ లేనివారిపై కొరఢా ఝులిపిస్తోంది. కరోనా నిబంధనలు పాటించని వారిపై చర్యలు చేపడుతున్నారు పోలీసులు. మాస్క్ లేకుండా బయట వెళ్లేవారికి జరిమానా విధిస్తున్నారు పోలీసులు.
అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. నిబంధనలు తప్పకుండా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం థర్డ్వేవ్ ముగింపు దశలో ఉంది. ఒక వైపు పాజిటివ్ కేసులు, మరో వైపు కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి: