Andhra Pradesh: రెండు సంవత్సరాలు కాదు కదా.. రెండు జన్మలెత్తినా ముఖ్యమంత్రి కాలేరు.. చంద్రబాబుపై మంత్రి అంబటి ఫైర్
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు సంవత్సరాలు కాదు కదా.. రెండు జన్మలెత్తినా ఆయన ముఖ్యమంత్రి కాలేరని షాకింగ్ కామెంట్స్ చేశారు. గుంటూరు తూర్పు....
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు సంవత్సరాలు కాదు కదా.. రెండు జన్మలెత్తినా ఆయన ముఖ్యమంత్రి కాలేరని షాకింగ్ కామెంట్స్ చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్లీనరి సమావేశం సందర్భంగా అంబటి రాంబాబు(Ambati Rambabu) ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసేందుకే ప్లీనరీలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. టీడీపీలో సంక్షేమ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే వచ్చాయని ఆరోపించారు. కానీ వైసీపీ పాలనలో కుల మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామన్నారు. కాపులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అనుకుంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబును(Chandrababu Naidu) సీఎం చేయాలని తపన పడుతున్నారని ఎద్దేవా చేశారు. ముద్రగడ పద్మనాభంను ఇబ్బంది పెట్టినప్పుడు చిరంజీవి అయినా మాట్లాడారని, కానీ పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాపులు పవన్ కళ్యాణ్ ని నమ్మి వెళ్తే బంగాళాఖాతంలోకి వెళ్లినట్లేనని తీవ్రంగా విమర్శించారు.
కట్టకట్టి కృష్ణ బ్యారేజి దగ్గర పాతేస్తాం..!! – మంత్రి @AmbatiRambabu#DushtaChathushtayam #PoliticalTerroristCBN #EndOfTDP pic.twitter.com/9YhScIkaQh
ఇవి కూడా చదవండి— Ganeshkumar Reddy Y (@yganeshreddy99) June 28, 2022
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు-నేడు, డిజిటల్ లెర్నింగ్పై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడంపై సమీక్షించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ఇస్తామని, ఆ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ను లోడ్ చేయాలని స్పష్టం చేశారు.