Andhra Pradesh: నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. సీబీఐ విచారణకు ఆదేశం..
Nellore Court: నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసుపై సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ హైకోర్టు. ఫైళ్ల మాయం కేసును సీబీఐకి అప్పగించింది హైకోర్టు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించింది.
నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసుపై సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ హైకోర్టు. ఫైళ్ల మాయం కేసును సీబీఐకి అప్పగించింది హైకోర్టు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించింది. నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టులో కీలక ఫైళ్లు మిస్ అయిన విషయం తెలిసిందే. ఓ ప్రజాప్రతినిధి కేసుకు సంబంధించిన పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలన్నీ మిస్ అయ్యాయి. గత ఏప్రిల్ నెలలో చోటు చేసుకున్న ఈ ఘటన.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా కోర్టులో దొంగలు పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఏప్రిల్ 13న అర్థరాత్రి వేళ దొంగలు పడ్డారు. ఓ కేసుకు సంబంధించి కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లారు. అయితే, ఈ చోరీని మరుసటి రోజు ఉదయం గుర్తించిన కోర్టు సిబ్బంది.. స్థానిక చిన్నబజారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోర్టులో ఫైళ్లు మాయం అయ్యాయిని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ ఫైళ్ల మాయం కేసు హైకోర్టుకు చేరగా.. తాజాగా హైకోర్టుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ఫైళ్ల మాయం వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని ఆదేశించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..