పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
తాజాగా ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పక్కా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు పలు ఆదేశాలు..
లాక్డౌన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఒకవైపు కరోనాతో పోరాడుతూనే.. మరోవైపు ప్రజలకు కావాల్సిన అవసరాలను తెలుసుకుంటోంది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పక్కా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు పలు ఆదేశాలు కూడా జారీ చేసింది.
ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటే ఒక పింఛన్ను రద్దు చేయనుంది ప్రభుత్వం. అలాగే దివ్యాంగ, కిడ్నీ వ్యాధిగ్రస్తుల (డయాలసిస్ రోగులు), డీఎమ్హెచ్వో(క్యాన్సర్, థలసీమియా, పక్షవాతం) పింఛన్లకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆధార్ కార్డు, ప్రజాసాధికార సర్వేల ఆధారంగా రాష్ట్రంలో ఒకే రేషన్ కార్డు మీద రెండు పింఛన్లు పొందుతున్న వారి వివరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. వాటిని పంచాయతీలు, వార్డుల వారీగా విభజించి పురపాలక కమిషనర్ లేదా ఎంపీడీవోలకు పంపించింది.
ఈ నెల 15వ తేదీలోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవమైతే ఒక పింఛను రద్దు చేయాలని ఆలోచిస్తుంది ప్రభుత్వం. పరిశీలన బాధ్యతను వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) రాజబాబు ఆదేశాలు జారీ చేశారు.
Read More:
దిల్రాజు వెడ్స్ తేజస్విని.. మాతృదినోత్సవం రోజు కొత్త జీవితం
కరోనాతో సహజీవనం చేయాల్సిందే: కాన్ఫరెన్స్లో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు