Andhra Pradesh – PRC: మంత్రుల కమిటీకి ఉద్యోగ సంఘాల లేఖ.. అందులో ఏం డిమాండ్ చేశారంటే..
Andhra Pradesh - PRC: ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ రచ్చ ఇంకా కొనసాగుతోంది. పీఆర్సీ అంశంపై ప్రభుత్వం వేసిన మంత్రుల..
Andhra Pradesh – PRC: ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ రచ్చ ఇంకా కొనసాగుతోంది. పీఆర్సీ అంశంపై ప్రభుత్వం వేసిన మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఇవాళ సచివాలయంలో మంత్రుల కమిటీకి పీఆర్సీ సాధన సమితి తరఫున వినతి పత్రం అందజేశారు ఉద్యోగ సంఘాల నేతలు. అసుతోష్ మిశ్రా కమిటీ నివేదికతో పాటు పీఆర్సీ జీవోలను నిలుపుదల చేయడం, పీఆర్సీ కంటే మునుపటి వేతనాలు 2022 జనవరి నెలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంత్రుల కమిటీ కి లేఖ రాశారు. ఈ మూడు అంశాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరిస్తే చర్చలకు సిద్ధమని లేఖలో స్పష్టం చేసింది స్టీరింగ్ కమిటీ.
Also read:
Vastu Tips for Plants: ఇంట్లో ఈ 10 మొక్కలు నాటండి.. లక్ష్మి దేవి అనుగ్రహం పొందండి..
Viral Video: కుమ్మేందుకు దూసుకొచ్చి గొర్రె.. ఆ వ్యక్తి తప్పించుకున్న విధానం చూస్తే వావ్ అనాల్సిందే..