Jagan Power Review: బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు.. ఉత్పత్తి ప్లాంట్ల సామర్థ్యం పెంచండిః సీఎం జగన్
బొగ్గు కొరత సంక్షోభం నుంచి బయటపడేది ఎలా? అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలేంటి? సమస్యకు ఉన్న పరిష్కార మార్గాలేంటి అంటూ ఉన్నతాధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు.
CM Jagan Review on Electricity: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. బొగ్గు కొరత సంక్షోభం నుంచి బయటపడేది ఎలా? అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలేంటి? సమస్యకు ఉన్న పరిష్కార మార్గాలేంటి అంటూ ఉన్నతాధికారులతో సమీక్షించారు. థర్మల్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలపై సీఎం ఆరా తీశారు. థర్మల్ కేంద్రాలు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడున్నా కొనుగోలు చేయాలన్నారు. ఏపీలో బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదన్న సీఎం.. థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలన్నారు.
కృష్ణపట్నం, VTPSSల్లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలన్నారు CM జగన్. ఫలితంగా 1600 మెగావాట్ల విద్యుత్ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గు తెప్పించుకోవాలని సూచించారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.