Andhra Pradesh: వైద్య ఆరోగ్య శాఖ పై సీఎం జగన్ సమీక్ష.. జనరల్ బదిలీలకు గ్రీన్సిగ్నల్..
Andhra Pradesh: వైద్య ఆరోగ్య శాఖ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో జనరల్ బదిలీలకు
Andhra Pradesh: వైద్య ఆరోగ్య శాఖ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో జనరల్ బదిలీలకు సీఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు.. ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో సిబ్బంది ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆలోగా కొత్త రిక్రూట్మెంట్లను కూడా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వైద్యం పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా కోవిడ్ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు రంగాలలోని ఆస్పత్రులను కూడా దీనికి సిద్ధంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ఉధృతం చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ చేయాలన్నారు. ఫీవర్ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. వారికి టీకాలు వేయాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో 6 ఒమిక్రాన్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. వీరిలో ఎవరు కూడా ఆస్పత్రిపాలు కాలేదని తెలిపారు.
అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం భయాందోళనలు అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతరత్రా ప్రాంతాలనుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. కోవిడ్ కేసుల డేటాను పరిగణలోకి తీసుకుని ఆమేరకు తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా ఇంటింటికీ ఫీవర్ సర్వే తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేశారు.
Also read:
Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు అంటే..!
వామ్మో ఇదేందిరా బాబు.. పిల్లిని దువ్విన కుందేలు.. ఎందుకు ఇంతలా కాకా పట్టిందో తెలుసా..