Breaking: ఇంగ్లీష్ మీడియంపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం..!
పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై ఏపీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంగ్ల మాధ్యమం అమలుపై సర్వే చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై ఏపీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంగ్ల మాధ్యమం అమలుపై సర్వే చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ ప్రముఖ సంస్థతో ధర్డ్ పార్టీ సర్వే చేయించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ మేరకు తాజాగా డెసిషన్ తీసుకుంది. ఈ క్రమంలో విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలపై షార్ట్ ఫిల్మ్లు నిర్మించేందుకు ఓ ఆంగ్ల ఛానెల్కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సమగ్ర శిక్షణా అభియాన్ కింద షార్ట్ ఫిల్మ్లతో పాటు సర్వే చేయించాలని నిర్ణయించింది. జూన్ నెలాఖరు కల్లా వీటిని పూర్తి చేసి జూలైలో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు అభ్యంతరాలను కొత్తగా ఆదేశాలు ఇవ్వాలన్న భావనలో ప్రభుత్వం ఉంది.
కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం.. దీనికి సంబంధించి రెండు జీవోలు తీసుకొచ్చింది. అయితే వాటిని హైకోర్టు కొట్టివేసింది. ఏ మాధ్యమంలో చదువుకోవాలనుకున్నది తల్లిదండ్రులు, విద్యార్థులే నిర్ణయించుకుంటారని తెలిపిన న్యాయస్థానం.. వారి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రభుత్వం తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అందుకు రాష్ట్రవ్యాప్తంగా 96.17 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించడంతో పాటు.. తమ అంగీకారాన్ని ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ క్రమంలో ఇంగ్లీష్ మీడియం బోధనపై ఈ నెల 13న ఏపీ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. దాని ప్రకారం 2020-21 సంవత్సరానికి గానూ 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కానుంది. అయితే మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి. ఒకవేళ అందులోని విద్యార్థులు కోరుకుంటే వారికి కూడా సమాంతరంగా ఇంగ్లీష్ మీడియం క్లాసులను చెప్పనున్నారు. అలాగే ప్రభుత్వ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ స్కూళ్లలో ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం ఉండగా.. అవి యధాతథంగా కొనసాగనున్నాయి. ఇక ఆ తరువాత నుంచి ఏటా క్రమేణా 7, 8, 9, 10 తరగతులు ఇంగ్లీష్ మీడియంగా మారనున్నాయి.
Read This Story Also: కమల్ క్రేజీ సీక్వెల్లో ఆ ముగ్గురు హీరోయిన్లు..!