మరో సంచలన నిర్ణయం.. పొగాకు రైతులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వమే పొగాకు కొనుగోళ్లు చేపట్టేందుకు సిద్ధమౌతోంది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.
జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వమే పొగాకు కొనుగోళ్లు చేపట్టేందుకు సిద్ధమౌతోంది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. బుధవారం నుంచి రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకే రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లను ప్రభుత్వమే చేపడుతుందని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో ఒంగోలులోని 1, 2కేంద్రాల ద్వారా పొగాకు కొనుగోళ్లు ప్రారంభిస్తామని కన్నబాబు చెప్పుకొచ్చారు. ఆ తరువాత అన్ని ప్రాంతాల్లో కొనుగోళ్లు చేపడుతామని ఆయన అన్నారు. ఎఫ్3, ఎఫ్4, ఎఫ్5, ఎఫ్8, ఎఫ్9 గ్రేడు పొగాకును తాము కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. పొగాకు బోర్డు చెప్పిన దానికంటే అధిక మొత్తానికి కొనుగోళ్లు చేస్తామని కన్నబాబు వివరించారు.