కంటతడి పెట్టుకున్న వైసీపీ మహిళా ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టుకున్నారు. నంబూరులో పట్టుబడ్డ పేకాట శిబిరానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీదేవి స్పష్టం చేశారు. మహిళా ఎమ్మెల్యేనని చూడకుండా..

కంటతడి పెట్టుకున్న వైసీపీ మహిళా ఎమ్మెల్యే
YSRCP
Follow us

|

Updated on: Jul 30, 2020 | 1:24 PM

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టుకున్నారు. నంబూరులో పట్టుబడ్డ పేకాట శిబిరానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీదేవి స్పష్టం చేశారు. మహిళా ఎమ్మెల్యేనని చూడకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేకాట రాయుళ్లని వదిలేయాలని తాను ఎవరికీ చెప్పలేదని.. పేకాట విషయంలో పోలీసులు పూర్తి విచారణ చేయాలన్నారు. అయినా అది జరిగింది తాడికొండ నియోజకవర్గంలో కాదన్నారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ నెల 27న నంబూరులో పేకాట శిబిరం నిర్వహిస్తూ పట్టుబడ్డా సురేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది..దీంతో అతని వెనక ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే శ్రీదేవి క్లారిటీ ఇచ్చారు.

Read More:

సర్కార్ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ చేతివాటం

ఆ జిల్లా ‘పెద్దపులుల సంతానోత్పత్తి’ కేంద్రం!