ఏపికి తప్పిన ముప్పు..! బలహీనపడింది
ఓ వైపు కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ని వణికిస్తోంది. వాతావరణంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా బంగాళాఖాతంలో తుపాను,...
కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ని వణికిస్తోంది. ఇటువంటి తరుణంలో మరో పెను ముప్పు ఏపీని మరింత భయాందోళనకు గురిచేసింది. ముంచుకొస్తున్న ప్రమాదం ఇప్పుడు తప్పిపోయింది. దూసుకొస్తుందన్న గండం గడిచిపోయింది. ఏపీకి ఎంఫాన్ ముప్పు లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాతావరణంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా బంగాళాఖాతంలో తుపాను బలపడలేదని పేర్కొంది. కాగా, తూర్పు మధ్యప్రదేశ్ నుంచి తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.