జగన్పై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లంచాలకు కాపీ రైట్ వైఎస్ జగన్దే అని విమర్శించారు. ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను అని మాట్లాడటం కంటే.. నేను ఉన్నాను.. నేను తిన్నాను అంటే బావుంటుంది’’ అని ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పటికైనా భ్రమలో బతకడం మానుకోవాలని రాజేంద్రప్రసాద్ హితవుచెప్పారు. తాము ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను కొత్తగా అమలు చేస్తామంటున్నారని, ఇది మరీ విడ్డూరంగా ఉందన్నారు. జగన్ అమలు చేస్తామని చెప్తున్న […]
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లంచాలకు కాపీ రైట్ వైఎస్ జగన్దే అని విమర్శించారు. ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను అని మాట్లాడటం కంటే.. నేను ఉన్నాను.. నేను తిన్నాను అంటే బావుంటుంది’’ అని ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పటికైనా భ్రమలో బతకడం మానుకోవాలని రాజేంద్రప్రసాద్ హితవుచెప్పారు. తాము ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను కొత్తగా అమలు చేస్తామంటున్నారని, ఇది మరీ విడ్డూరంగా ఉందన్నారు. జగన్ అమలు చేస్తామని చెప్తున్న 2013 భూసేకరణ చట్టాన్ని.. తాము ఎప్పటినుంచో అమలు చేస్తున్నామని రాజేంద్రప్రసాద్ వివరించారు. టీడీపీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఎంతో ఆదరించారని ఆయన తెలిపారు.