రాజధానిలో జనసేనాని పర్యటన..

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి పవన్ పర్యటన ప్రారంభించారు. ముందుగా నిడమర్రు గ్రామాన్ని సందర్శించి.. కురగల్లు, ఐనవోలు మీదుగా ఎన్‌జీవోల కోసం నిర్మిస్తున్న క్వార్టర్లు, హైకోర్టు నిర్మాణాలు పరిశీలించారు. తరువాత సచివాలయం, జడ్జిల క్వార్టర్లు, మంత్రుల క్వార్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేల క్వార్టర్లు పరిశీలించారు. అనంతరం సీడ్‌ యాక్సెస్‌ రోడ్లు, CRDA భవనాలు, చివరగా కొండవీడు ఎత్తిపోతల పథకం పరిశీలనతో పవన్‌ రాజధాని టూర్‌ ముగుస్తుంది. మరోవైపు రాజధానిని మారుస్తారంటూ […]

రాజధానిలో జనసేనాని పర్యటన..
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2019 | 3:18 PM

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి పవన్ పర్యటన ప్రారంభించారు. ముందుగా నిడమర్రు గ్రామాన్ని సందర్శించి.. కురగల్లు, ఐనవోలు మీదుగా ఎన్‌జీవోల కోసం నిర్మిస్తున్న క్వార్టర్లు, హైకోర్టు నిర్మాణాలు పరిశీలించారు. తరువాత సచివాలయం, జడ్జిల క్వార్టర్లు, మంత్రుల క్వార్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేల క్వార్టర్లు పరిశీలించారు. అనంతరం సీడ్‌ యాక్సెస్‌ రోడ్లు, CRDA భవనాలు, చివరగా కొండవీడు ఎత్తిపోతల పథకం పరిశీలనతో పవన్‌ రాజధాని టూర్‌ ముగుస్తుంది. మరోవైపు రాజధానిని మారుస్తారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. రాజధానికి భూములిచ్చిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అన్ని పార్టీల దగ్గరకు వెళ్ళి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. రాజధాని పర్యటనలో ఉన్న పవన్ రైతుల సమస్యలను కూడా స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.