ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీ పర్యటన
ఏపీ సీఎం జగన్ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఏపీకి రావాల్సిన నిధులపై కేంద్రంతో చర్చించే అవకాశాలున్నాయి. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ విషయాలను కేంద్రం ముందుంచే అవకాశముంది. సీఎం జగన్ రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు. అంతకుముందు ఆయన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఏపీ సీఎం జగన్ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఏపీకి రావాల్సిన నిధులపై కేంద్రంతో చర్చించే అవకాశాలున్నాయి. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ విషయాలను కేంద్రం ముందుంచే అవకాశముంది. సీఎం జగన్ రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు. అంతకుముందు ఆయన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.