నాపై కులం ముద్రవేస్తారా..?
ఏపీ రాజకీయాలు ప్రస్తుతం హాట్హాట్గా కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి మూడు రాజధానులన్న అంశం తెరపైకి రావడంతో.. ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దంటూ అక్కడి రైతులు ఆందోళనలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అమరావతి రాజధాని విషయంలో కులం రంగు అంటగట్టి.. విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో హైదరాబాద్ను కూడా అభివృద్ధి చేశానని.. నా కులం ఉందనో, నా కుటుంబం కోసమో […]
ఏపీ రాజకీయాలు ప్రస్తుతం హాట్హాట్గా కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి మూడు రాజధానులన్న అంశం తెరపైకి రావడంతో.. ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దంటూ అక్కడి రైతులు ఆందోళనలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అమరావతి రాజధాని విషయంలో కులం రంగు అంటగట్టి.. విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో హైదరాబాద్ను కూడా అభివృద్ధి చేశానని.. నా కులం ఉందనో, నా కుటుంబం కోసమో హైదరాబాద్ను అభివృద్ధి చేయలేదన్నారు. సైబరాబాద్ నిర్మించడం, సైబర్ టవర్స్ నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి ఏ కులం కోసమో కాదన్నారు. అలాంటి నాపైన కులం ముద్ర వేస్తారా అంటూ ప్రశ్నించారు.
అలాగే అమరావతిని కూడా ఒక కులం కోసమో, ఒక ప్రాంతం కోసమో నిర్మించాలనుకోలేదని.. రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన రాజధానిని అందించాలన్న సంకల్పంతో.. అన్ని ప్రాంతాలకు చేరువలో నిర్మించాలనుకున్నామన్నారు. అమరావతిని ఒక ఆర్ధిక వనరుగా తయారు చేసి, ఆ అభివృద్ధి ఫలాలను రాష్ట్ర ప్రజలకు అందించాలనుకున్నామన్నారు. అటువంటి రాజధానికి కులం రంగు పూసి విచ్చిన్నం చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. అది వైసీపీ నేతలు బుద్దిహీనతకు గుర్తని.. ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని అన్నారు. అలాంటి అమరావతిని కాపాడుకోవడం రాష్ట్ర ప్రజలుగా మనందరి బాధ్యతని.. రాజధాని రైతులకు అండగా నిలిచి పోరాటానికి సిద్ధమవుదామంటూ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.
నా కులం ఉందనో, నా కుటుంబం కోసమో హైదరాబాద్ అభివృద్ధి చేయలేదు. సైబరాబాద్ నిర్మించడం, సైబర్ టవర్స్ నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి ఏ కులం కోసమో కాదు. అలాంటి నాపై కులం ముద్ర వేస్తారా?(1/3) pic.twitter.com/Qe4U6UHrEj
— N Chandrababu Naidu (@ncbn) January 1, 2020
అలాగే అమరావతిని ఒక కులం కోసమో, ఒక ప్రాంతం కోసమో నిర్మించాలనుకోలేదు. రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన రాజధానిని అందించాలన్న సంకల్పంతో.. అన్ని ప్రాంతాలకు చేరువలో నిర్మించాలనుకున్నాం. అమరావతిని ఒక ఆర్ధిక వనరుగా తయారు చేసి, ఆ అభివృద్ధి ఫలాలను రాష్ట్రానికి అందించాలనుకున్నాం.(2/3) pic.twitter.com/dnLd6X9tw1
— N Chandrababu Naidu (@ncbn) January 1, 2020
అటువంటి రాజధానికి కులం రంగు పూసి విచ్చిన్నం చేయాలనుకోవడం దుర్మార్గం. అది వైసీపీ నేతలు బుద్దిహీనత. ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. అలాంటి అమరావతిని కాపాడుకోవడం రాష్ట్ర ప్రజలుగా మనందరి బాధ్యత. రాజధాని రైతులకు అండగా నిలిచి పోరాటానికి సిద్ధమవుదాం.(3/3)
— N Chandrababu Naidu (@ncbn) January 1, 2020