బీసీ రిజర్వేషన్లపై జగన్కు చంద్రబాబు లేఖ.. సీఎంపై ఫైర్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. బీసీలకు అమలవుతున్న 34 శాతం రిజర్వేషన్లు పరిరక్షించాలని ఆయన ఆ లేఖలో కోరారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. బీసీలకు అమలవుతున్న 34 శాతం రిజర్వేషన్లు పరిరక్షించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ప్రభుత్వ తాజా చర్యతో బీసీలకు రిజర్వేషన్ ఫలాలు దూరమవుతున్నాయని.. బీసీలకు 24శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలనుకోవడం సరికాదని ఆయన సూచించారు. దీనిపై సుప్రీం కోర్టులో వెంటనే స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని చంద్రబాబు అన్నారు. ఇంత తీవ్రమైన సమస్యపై అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. బీసీ సంఘాలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం సరికాదని చంద్రబాబు మండిపడ్డారు.