Achennayudu: ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగులు సహకరించాల్సిందే: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు
Achennayudu: ఏపీ రాష్ట్రంలో వింత పరిస్థితి ఉందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగులు
Achennayudu: ఏపీ రాష్ట్రంలో వింత పరిస్థితి ఉందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగులు సహకరించాల్సిందేనని అన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలతోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రెవెన్యూ డివిజన్ల వారీగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు.