75th independence day: హక్కులు అందరికీ సమానంగా అందాలి.. జాతీయ జెండాను ఎగురవేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్..
CM YS Jagan Hoists the National Flag: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
CM YS Jagan Hoists the National Flag: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందనం అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పాదయాత్రలో జనం సమస్యలు తెలుసుకున్నానని పేర్కొన్నారు. కొత్త లక్ష్యాలను నిర్ధేశించుకునే సమయమిదని సీఎం జగన్ పేర్కొన్నారు. రేపు అనేది ప్రతీ ఒక్కరికి భరోసా ఇచ్చేలా ఉండాలని సీఎం వ్యాఖ్యానించారు. అందరి అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.
మహిళలు మరింత రాజకీయ సాధికారత సాధించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. గ్రామ, సచివాలయాల కింద లక్షా 30వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. రైతులతోపాటు.. అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. అందరికీ సమాన హక్కులు లభించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతులకు ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలుచేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. వ్యవసాయం రంగానికి 83 వేల కోట్లను ఖర్చుచేశామని సీఎం జగన్ పేర్కొన్నారు.
26 నెలల కాలంలో ఎన్నో పథకాలను ప్రారంభించామని, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని సీఎం జగన్ పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూళ్లు తరహాలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను మారుస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. గోరుముద్ద పథకం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
వైయస్సార్ చేయూత పథకం కింద ఇప్పటివరకు 9 వేల కోట్ల రూపాయలు మహిళలకు అందజేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని.. మొదటి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. వైయస్సార్ సున్నా వడ్డీ పథకానికి 2,509 కోట్లు కేటాయించినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు.
దేశ చరిత్రలోనే మొదటిసారిగా నామినేటెడ్ పదవుల్లో 50శాతం మహిళలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అక్కచెల్లెమ్మల భద్రత కోసం దిశ బిల్లు, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు జగన్ పేర్కొన్నారు. దీంతోపాటు మద్యం నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
Also Read: