Ap Corona Bulletin: ఆంధ్రప్రదేశ్ కరోనా అప్డేట్.. 24 గంటల్లో 172 పాజిటివ్ కేసులు నమోదు.. ఒకరు మృతి..
Andhra Pradesh Corona Updates: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 172 మంది కరోనా బారిన పడ్డారు.
Andhra Pradesh Corona Updates: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 172 మంది కరోనా బారిన పడ్డారు. ఇక కరోనా సోకి ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38,323 శాంపిల్స్ పరీక్షించిన వైద్యులు.. 172 మందికి కరోనా సోకినట్లు తేల్చారు. ఇక 203 మంది కరోనా జయించి పూర్తిగా ఆరోగ్యవంతులు అయ్యారు.
తాజా గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 8,87,238 కాగా… కరోనాను జయించిన వారి సంఖ్య 8,78,731 కు చేరింది. ఇక కరోనా బారిన పడి 7,150 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,357 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో కొందరు హోంఐసోలేషన్లో ఉండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Also read:
కరోనా ఎఫెక్ట్ : ఇటలీలో రాజకీయ గందరగోళం.. రాజీనామా చేయనున్న ప్రధాని గిసెప్పే కాంటే
BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు రిపబ్లిక్ డే ఆఫర్.. ఇక నుంచి అన్ని సర్కిళ్లలో..