మండలి చైర్మన్ షరీఫ్కు నెగిటివ్
కరోనా నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ షరీఫ్ కోలుకున్నారు. నెగిటివ్ వచ్చినట్లు శాసనమండలి చైర్మన్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. బుధవారం చేయించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో షరీఫ్కు నెగిటివ్ నిర్దారణ ..
Sharif has Recovered : కరోనా నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ షరీఫ్ కోలుకున్నారు. నెగిటివ్ వచ్చినట్లు శాసనమండలి చైర్మన్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. బుధవారం చేయించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో షరీఫ్కు నెగిటివ్ నిర్దారణ అయిందని తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఆయన మరికొన్ని రోజులు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోనున్నారు. ఇటీవల షరీఫ్కు కరోనా పాజిటివ్ అని తేలింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. నిన్న చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి షరీఫ్ డిశ్చార్జ్ అయినట్లు సమాచారం.
ఈ నెల 1న ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంద్రి ప్రజా ప్రతినిధులకు కోవిడ్ వ్యాపించడం కొంత ఆందోళన కలిగిస్తోంది.