మరోసారి ఐపీఎస్ల బదిలీలు: లిస్ట్లో కడప ఎస్పీ..!
ఏపీలో 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 మందిని బదిలీ చేస్తూ.. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారు. సీఎంగా జగన్ నియమితులైనప్పటి నుంచీ.. ఏపీలో బదిలీలు ఎక్కువగా జరుగుతోన్నాయి. తాజాగా.. ఆర్టీసీ మాజీ ఎండీ సురేంద్రబాబును ట్రాన్స్ఫర్ చేశారు. కాగా.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కడప ఎస్పీ అభిషేక్ మహంతిని బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. వివేకా మర్డర్ కేసు దర్యాప్తు […]
ఏపీలో 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 మందిని బదిలీ చేస్తూ.. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారు. సీఎంగా జగన్ నియమితులైనప్పటి నుంచీ.. ఏపీలో బదిలీలు ఎక్కువగా జరుగుతోన్నాయి. తాజాగా.. ఆర్టీసీ మాజీ ఎండీ సురేంద్రబాబును ట్రాన్స్ఫర్ చేశారు.
కాగా.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కడప ఎస్పీ అభిషేక్ మహంతిని బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. వివేకా మర్డర్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ చీఫ్గా ఉన్న అభిషేక్ మహంతి. వివేకా హత్య తర్వాత ఏడాది తిరిగే లోపు ఇద్దరు ఎస్పీలు బదిలీ అయ్యారు. గతంలో రాహుల్ హెగ్డే, అభిషేక్ మహంతి బదిలీలు అయ్యారు. వివేకా హత్య కేసు చివరిదశలో ఉండగా.. ఆయన్ను బదిలీ చేశారు.
ట్రాన్స్ఫర్ అయిన లిస్ట్:
1. కేకేఎన్ అన్బురాజన్ (కడప ఎస్పీ) 2. సీహెచ్ విజయా రావు (గుంటూరు రూరల్ ఎస్పీ) 3. విక్రాంత్ పాటిల్ (డీసీపీ 2- విజయవాడ) 4. సెంథిల్ కుమార్ (చిత్తూరు ఎస్పీ) 5. సీహెచ్ వెంకట అప్పల నాయుడు (ఇంటెలిజెన్స్ ఎస్పీ) 6. గజరావ్ భూపాల్ (తిరుపతి అర్బన్ ఎస్పీ) 7. ఎస్వీ రాజశేఖర బాబు (డీజీపీ ఆఫీస్) 8. భాస్కర్ భూషణ్ 9. ఎస్ హరికృష్ణ 10. అమిత్ గార్గ్ 11. వి సునీల్ కుమార్ 12. కే వెంకటేశ్వర రావు