రైతాంగానికి బాసటగా జగన్ సర్కార్.. మరో ముందడుగు
ఏపీ సర్కార్ అన్నదాతకు అండగా నిలుస్తోంది. రైతుకు భరోసానిస్తూ..పరిపాలనలో మరో ముందడుగు వేసింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా పలు ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ సర్కార్ అన్నదాతకు అండగా నిలుస్తోంది. రైతుకు భరోసానిస్తూ..పరిపాలనలో మరో ముందడుగు వేసింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా పలు ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సోమవారం అనుమతినిచ్చింది.
రైతులకు తొమ్మిది గంటలు పగటిపూట ఉచిత విద్యుత్ అందించే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతి నిచ్చింది. ఇప్పటికే రైతులకు అందించే సబ్సిడీని గత ప్రభుత్వాలు ఇచ్చిన దానితో పోలీస్తే జగన్ సర్కార్ మూడు రెట్లు పెంచింది. 2015-16లో 3186 కోట్ల సబ్సిడీని ఇస్తే 2020-21లో ప్రభుత్వం దానిని 8354 కోట్లకు పెంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 18.37 లక్షల పంపుసెట్లకు గాను 12221 మిలియన్ వాట్ల విద్యుత్ అవసరాన్ని గుర్తించినట్లు విద్యుత్ శాఖ తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం పట్ల ఏపీ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.