రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీ

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత ఏపీ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ గురువారం భేటీ కానుంది.

రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 04, 2020 | 9:07 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత ఏపీ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ గురువారం భేటీ కానుంది. ఏపీలో కీలక బిల్లులతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రి మండలి సమావేశమవుతున్నట్లు సమాచారం. అలాగే, నవంబరు 15 తర్వాత వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కేబినెట్ లో అసెంబ్లీ సమావేశాలు, అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి.. ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలపై మంత్రిమండలి భేటీ తర్వాతే స్పష్టత వచ్చే అవకాశముంది. దీంతో పాటు దిశ చట్టంలో మార్పులు చేసి మరోసారి ఆమోదించాల్సి ఉంది. అదే సమయంలో విశాఖకు రాజధాని మార్పుకు సంబంధించిన నిర్ణయాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.