ఈనెల 16వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ రాష్ట్ర గవర్నర్. కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన బడ్జెట్ సమావేశాలు ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ సమావేశాలు ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు సంబంధించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. 16న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలుకానున్నాయి. మొదటి రోజు సభ ముగిసిన తర్వాత బడ్జెట్ రాష్ట్రంలోని ఇతర సమస్యలపై ఏయే అంశాలపై చర్చించే సమయాన్ని శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగనుండడంతో ఈ సమయంలోనే బడ్జెట్ సమావేశాలు కలిసొచ్చేలా సమావేశాలకు ప్రభుత్వం ప్లాన్ చేసింది.