ఎక్కువ కిక్కు కోసం స్పిరిట్ తాగి ముగ్గురు మృతి..
విశాఖ జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కశింకోట గోవిందరావు కాలనీలో మత్తు కోసం సర్జికల్ స్పిరిట్ తాగి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు పోగోట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోవిందరావు కాలనీకి చెందిన కూనిశెట్టి ఆనంద్ రావ్ మిత్రులతో కలిసి పార్టీ చేసుకుందామని భావించారు. అయితే మత్తు ఎక్కువ ఇస్తుందని మద్యానికి బదులు స్పిరిట్ను తీసుకొని వచ్చాడు. పార్టీలో ఆరుగురు పాల్గొనగా..వారిలో నలుగురు స్పిరిట్ సేవించారు. అయితే స్పిరిట్ సేవించిన వెంటనే ముగ్గరు తీవ్ర అస్వస్థతకు గురై ముగ్గురు […]
విశాఖ జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కశింకోట గోవిందరావు కాలనీలో మత్తు కోసం సర్జికల్ స్పిరిట్ తాగి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు పోగోట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోవిందరావు కాలనీకి చెందిన కూనిశెట్టి ఆనంద్ రావ్ మిత్రులతో కలిసి పార్టీ చేసుకుందామని భావించారు. అయితే మత్తు ఎక్కువ ఇస్తుందని మద్యానికి బదులు స్పిరిట్ను తీసుకొని వచ్చాడు. పార్టీలో ఆరుగురు పాల్గొనగా..వారిలో నలుగురు స్పిరిట్ సేవించారు. అయితే స్పిరిట్ సేవించిన వెంటనే ముగ్గరు తీవ్ర అస్వస్థతకు గురై ముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతి చెందింది.. వకూనిశెట్టి ఆనంద్, పెతకం శెట్టి అప్పారావు, డిసెల నూకరాజులుగా గుర్తించారు.