Ap Corona Cases: ఏపీలో కొత్తగా 114 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
ఆంధ్రప్రదేశ్ కరోనా తీవ్రత కొనసాగుతోంది. శుక్రవారంతో పోల్చితే శనివారం కేసుల సంఖ్య కాస్త పెరిగింది. పండుగ నేపథ్యంలో ప్రయాణాలు, కోడి పందేల వద్ద సమూహాలుగా గుమికూడటం...
Ap Corona Cases: ఆంధ్రప్రదేశ్ కరోనా తీవ్రత కొనసాగుతోంది. శుక్రవారంతో పోల్చితే శనివారం కేసుల సంఖ్య కాస్త పెరిగింది. పండుగ నేపథ్యంలో ప్రయాణాలు, కోడి పందేల వద్ద సమూహాలుగా గుమికూడటం వంటి అంశాలు ఈ పెరుగుదలకు కారణం అవ్వొచ్చు. రాష్ట్రంలో కొత్తగా 25,542 మందికి కరోనా టెస్టులు చేయగా 114 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,824కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. శుక్రవారం ఒక్క రోజే కోవిడ్-19 నుంచి కోలుకుని 326 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం రికవరీల సంఖ్య 8,76,372కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,987 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో కొత్తగా ఒక్కరు కూడా ప్రాణాలు విడువకపోవడం ఊరటనిచ్చే అంశం. మొత్తం మృతుల సంఖ్య 7,139గా ఉంది.
#COVIDUpdates: 16/01/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,82,929 పాజిటివ్ కేసు లకు గాను *8,73,803 మంది డిశ్చార్జ్ కాగా *7,139 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,987#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/i9vGHjW9u6
— ArogyaAndhra (@ArogyaAndhra) January 16, 2021
ఇక, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. తొలి విడతలో రాష్ట్రంలో సుమారు 3 లక్షల 80 వేల మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. మొత్తం 332 కేంద్రాలకు గాను తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 33 కేంద్రాలు నెలకొల్పగా, విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు.
Also Read:
గాయపడ్డ తండ్రిని పరామర్శించేందుకు సొంతూరుకు జావాను.. రోడ్డు ప్రమాదంలో గాయపడి..ఆర్మీ దినోత్సవం రోజే
Cricketer Sophie Devine: సోఫీ డెవిన్.. మ్యాచ్ మాత్రమే కాదు హృదయాలను కూడా గెలుచుకుంది.. వావ్..