షాకింగ్ న్యూస్.. ఇద్దరు కరోనా పాజిటివ్ రోగులపై ఎఫ్ఐఆర్.. రీజన్ ఇదే..
కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ఇద్దరు రోగులపై అండమాన్ నికోబార్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సౌత్ డిప్యూటీ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లీగ్ జమాత్ సమావేశానికి అండమాన్ నికోబార్కు చెందిన పది మంది ముస్లింలు కూడా వెళ్లి.. తిరిగి అండమాన్కు చేరుకున్నట్లు తెలిపారు. వారిని పరీక్షించగా వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఈ క్రమంలో పోలీసులు.. వారు ఎవరెవరిని కలిశారో చెప్పమని ప్రశ్నిస్తే.. సరైన […]
కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ఇద్దరు రోగులపై అండమాన్ నికోబార్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సౌత్ డిప్యూటీ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లీగ్ జమాత్ సమావేశానికి అండమాన్ నికోబార్కు చెందిన పది మంది ముస్లింలు కూడా వెళ్లి.. తిరిగి అండమాన్కు చేరుకున్నట్లు తెలిపారు. వారిని పరీక్షించగా వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఈ క్రమంలో పోలీసులు.. వారు ఎవరెవరిని కలిశారో చెప్పమని ప్రశ్నిస్తే.. సరైన సమాచారం ఇవ్వకుండా పోలీసులను తప్పుదారి పట్టించారు. హోం క్వారంటైన్లో ఉండాలని కోరినా.. ఆ నిబంధనలను కూడా ఉల్లంఘించి తిరగడం ప్రారంభించారు. దీంతో పోలీసులు పాజిటివ్ వచ్చిన ఆ ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించి.. వారిద్దరిపఐ కేసులు నమోదు చేశారు. కాగా.. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులన్నీ.. ఈ మతపరమైన సమావేశానికి హాజరైనవారే తేలడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
Andaman and Nicobar: And giving wrong information about the places they visited during the home quarantine period apart from violating the terms and conditions of home quarantine. (2/2) (31-3-2020) https://t.co/QggKCgivWp
— ANI (@ANI) April 1, 2020