షాకింగ్.. ‘పుష్ప’ నుంచి ఆ నటిని తప్పించారా..!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్న మినహా మిగిలిన నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు చిత్రయూనిట్. అయితే ఈ మూవీ నుంచి కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి విజయ్ బయటకు వెళ్లినట్లు పుకార్లు వినిపించాయి. ఇక తాజాగా మరో నటిని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు టాక్ నడుస్తోంది.
టాలీవుడ్ వివరాల ప్రకారం.. తాను తెరకెక్కించిన రంగస్థలంలో యాంకర్ అనసూయకు మంచి పాత్ర ఇచ్చిన సుకుమార్.. పుష్పలో ఆమెకు అవకాశం ఇచ్చినట్లు మొదటి నుంచి టాక్ నడిచింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి అనసూయను తప్పించినట్లు తెలుస్తోంది. ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటోన్న చిత్ర యూనిట్.. అన్ని భాషల్లో కాస్త పేరు మోసిన క్యాస్టింగ్ను తీసుకోవాలని భావిస్తుందట. ఇక అనసూయకు తెలుగు మినహా.. మిగిలిన భాషల్లో క్రేజ్ లేకపోవడంతో ఆ పాత్ర నుంచి ఆమెను తప్పించినట్లు టాక్. ఇక ఈ పాత్రలో మరో నటి కోసం వెతుకుతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత..? రంగస్థలం నుంచి అనసూయ ఔట్ అయ్యిందా..? అసలు పుష్పలో ఎవరెవరు నటించబోతున్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Read This Story Also: కోలీవుడ్లో ‘ఆన్లైన్ రిలీజ్’ రచ్చ.. సూర్యకు నిర్మాతల మద్దతు..!