‘దొరసాని’ వచ్చేస్తోంది!

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు కె.వి.మహేంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘దొరసాని’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. 80వ దశకంలో ప్రేమకథ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్ ప్రోమో సినిమాపై అంచనాలను పెంచేశాయి. కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య కీలక పాత్రలు పోషిస్తున్న ఈ […]

'దొరసాని' వచ్చేస్తోంది!
Follow us

|

Updated on: Jun 22, 2019 | 5:47 PM

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు కె.వి.మహేంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘దొరసాని’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. 80వ దశకంలో ప్రేమకథ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్ ప్రోమో సినిమాపై అంచనాలను పెంచేశాయి. కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మధుర ఎంటర్‌టైన్మెంట్ , బిగ్ బెన్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా నుంచి ‘కలవరమై.. కలవరమై’ అనే పాట ఈనెల 24న రిలీజ్ చేయనున్నారు.