బ్రేకింగ్.. మిజోరాంలో భూకంపం..
గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం ఎక్కడో ఓ చో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఓ వైపు యావత్ దేశం కరోనా మహమ్మారితో వణికిపోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రకృతి కూడా కన్నెర..
గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం ఎక్కడో ఓ చో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఓ వైపు యావత్ దేశం కరోనా మహమ్మారితో వణికిపోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రకృతి కూడా కన్నెర చేస్తుండటంతో.. ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మొన్న లదాక్, నిన్న అసోం.. నేడు మిజోరాం.. ఇలా రోజుకు ఎక్కడో ఓ చోట భూకంపం వస్తుండటంతో ప్రజలంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా.. గురువారం మధ్యాహ్నం 2.28 గంటలకు మిజోరాంలోని చంపాయి ప్రాంతంలో భూకంపం సంభవించింది. అయితే తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి నష్టం వాటిళ్లలేదు. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 4.3 మాగ్నిట్యూడ్గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
An earthquake of magnitude 4.3 struck 23km South-West of Champhai, Mizoram at 2:28 pm today: National Center for Seismology (NCS) pic.twitter.com/lPjx6xzV64
— ANI (@ANI) July 9, 2020