ఏఎన్-32 విమాన శకలాలు లభ్యం… అంతా మృతులే!
భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 విమానం ఆచూకీ నిన్న లభించిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 13 మంది ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ 13 మంది ప్రాణాలతో మిగల్లేదని భారత వాయుసేన ప్రకటించింది. ఇప్పటికే ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశామని ఐఏఎఫ్ తెలిపింది. అరుణాచల్ప్రదేశ్లోని లిపో పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను గుర్తించారు. సుమారు 12వేల ఫీట్ల ఎత్తులో ఆ శకలాలను గుర్తించారు. వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ […]
భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 విమానం ఆచూకీ నిన్న లభించిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 13 మంది ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ 13 మంది ప్రాణాలతో మిగల్లేదని భారత వాయుసేన ప్రకటించింది. ఇప్పటికే ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశామని ఐఏఎఫ్ తెలిపింది. అరుణాచల్ప్రదేశ్లోని లిపో పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను గుర్తించారు. సుమారు 12వేల ఫీట్ల ఎత్తులో ఆ శకలాలను గుర్తించారు. వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ విమాన శకలాలను పసికట్టింది. 13మందితో ప్రయాణిస్తున్న ఏఎన్ – 32 విమానం గత సోమవారం మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హాత్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన కాసేపటికే అదృశ్యమైంది. నాటి నుంచి విమానం కోసం ఐఏఎఫ్ గాలింపు చేపట్టింది.
ఈ విమానంలో ప్రయాణిస్తున్న 13 మంది మృతదేహాల్ని, ఏఎన్-32 విమానం బ్లాక్ బాక్స్ ను విమాన శకలాల్లోనుండి స్వాధీనం చేసుకున్నారు.
All 13 bodies and black box of the #AN-32 transport aircraft recovered. Choppers would be used to ferry the bodies from the crash site in Arunachal Pradesh. pic.twitter.com/CN4d5ekl5t
— ANI (@ANI) June 13, 2019
Indian Air Force: IAF pays tribute to the brave air-warriors who lost their lives during the #AN32 aircraft crash on 3 Jun 2019 and stands by with the families of the victims. May their souls rest in peace. https://t.co/SJjGYIwIcj
— ANI (@ANI) June 13, 2019