Breaking: తల్లిని కలిసిన అమృత

తన తల్లి దగ్గరకు అమృత వెళ్లింది. మిర్యాలగూడలో మారుతీరావు ఇంటికి వెళ్లిన అమృత.. అక్కడ తన తల్లి గిరిజాను కలిసింది.

Breaking: తల్లిని కలిసిన అమృత
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2020 | 8:07 PM

తన తల్లి దగ్గరకు అమృత వెళ్లింది. మిర్యాలగూడలో మారుతీరావు ఇంటికి వెళ్లిన అమృత.. అక్కడ తన తల్లి గిరిజాను కలిసింది. మారుతీరావు మరణం తరువాత తొలిసారి తల్లి దగ్గరకు వెళ్లిన అమృత దాదాపు అరగంట పాటు ఆమెతో గడిపింది. ఈ సందర్భంగా తల్లిని పరామర్శించింది. అయితే ఆ సమయంలో అమృత బాబాయి శ్రవణ్ ఇంట్లో లేనట్లు సమాచారం. కాగా ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఈ నెల 7వ తేదీన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమృత అమ్మ దగ్గరకు వెళ్లు అంటూ ఆయన గదిలో గోడకు రాశారు. అయితే దీనిపై స్పందించిన అమృత.. తన తల్లి దగ్గరకు వెళ్లలేనని.. కానీ తన వద్దకు తల్లి వస్తే చూసుకుంటానంటూ తెలిపిన విషయం తెలిసిందే.