బ్రేకింగ్: మిర్యాలగూడ పీఎస్కు అమృత..అతడిపై కంప్లైంట్..
అమృత మిర్యాలగూడ పీఎస్కు వెళ్లి విజయ్ అనే వ్యక్తిపై కంప్లైంట్ ఇచ్చింది. తమ సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసు నిందితుడు కరీం కుమారుడికి చేరవేస్తున్నాడని అమృత ఫిర్యాదులో పేర్కొంది. విజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. విజయ్ అమృత ఇంటి ఎదురుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న అనంతరం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. తండ్రి చివరిచూపుకు స్మశానికి వెళ్లిన అమృతను బంధువులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అమృతకు, ఆమె బాబాయి […]
అమృత మిర్యాలగూడ పీఎస్కు వెళ్లి విజయ్ అనే వ్యక్తిపై కంప్లైంట్ ఇచ్చింది. తమ సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసు నిందితుడు కరీం కుమారుడికి చేరవేస్తున్నాడని అమృత ఫిర్యాదులో పేర్కొంది. విజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. విజయ్ అమృత ఇంటి ఎదురుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న అనంతరం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. తండ్రి చివరిచూపుకు స్మశానికి వెళ్లిన అమృతను బంధువులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అమృతకు, ఆమె బాబాయి శ్రవణ్కు మధ్య మాటల యుద్దం జరిగింది. కాగా ఇటీవల తల్లి గిరిజ దగ్గరికి వెళ్లిన అమృత ఆమెను ఓదార్చి వచ్చింది.