మరో ఏడు రోజులు ఆస్పత్రిలోనే అమితాబ్, అభిషేక్లు!
నానావతి ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అలాగే వీరిద్దరూ చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపారు. కనీసం బిగ్బీ, అభిషేక్ మరో ఏడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని..
బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్లు ఇటీవలే కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయం దేశ వ్యాప్తంగా అందరినీ షాక్కి గురి చేసింది. దీంతో అమితాబ్, అభిషేక్లు త్వరగా కోలుకోవాలని.. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేశారు. కాగా ప్రస్తుతం వీరి ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులు స్పందించారు.
నానావతి ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అలాగే వీరిద్దరూ చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపారు. కనీసం బిగ్బీ, అభిషేక్ మరో ఏడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని స్పష్టం చేశారు వైద్యులు.
కాగా వీరిద్దరితో పాటు అభిషేక్ భార్య ఐశ్వర్యా రాయ్, కూతురు ఆరాధ్యలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వీరిని ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉంచారు అధికారులు. ఇక అమితాబ్ బంగ్లాలోని పని చేస్తున్న 26 మందికి టెస్టులు నిర్వహించగా.. వారందరికీ నెగిటివ్ వచ్చింది. కాగా ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ త్వరగా కోలుకోవాలని.. పలువురు ప్రముఖులతో పాటు, వీరి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Read More:
బీ అలర్ట్.. ఇలా చేస్తే మీ వాట్సాప్ బ్లాక్ అవ్వడం ఖాయం..
ఎంత అమాయకత్వం.. నాలుగేళ్లు అవుతున్నా పాతనోట్లు రద్దైన విషయం తెలీదట..
ఏపీ విద్యార్థులకు గుడ్న్యూస్.. హాల్ టికెట్ పొందిన వారంతా పాస్..