హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అమిత్ షా తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ విచ్చేసిన ఆయనకు గవర్నర్ నరసింహన్, డీజీపీ మహేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మొదట ఆయన ఎయిర్ పోర్టులో CISF అధికారులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత శంషాబాద్ సమీపంలో రంగానాయకుల తండాలోని గిరిజన మహిళ సోనినాయక్ ఇంటికి వెళ్లి ఆమెకు తొలి సభ్యత్వాన్ని ఇస్తారు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగున్నరకు […]
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అమిత్ షా తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ విచ్చేసిన ఆయనకు గవర్నర్ నరసింహన్, డీజీపీ మహేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మొదట ఆయన ఎయిర్ పోర్టులో CISF అధికారులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత శంషాబాద్ సమీపంలో రంగానాయకుల తండాలోని గిరిజన మహిళ సోనినాయక్ ఇంటికి వెళ్లి ఆమెకు తొలి సభ్యత్వాన్ని ఇస్తారు.
అక్కడి నుంచి సాయంత్రం నాలుగున్నరకు శంషాబాద్ లోని KLCC ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటల 15 నిమిశాలకు పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తారు. నేతలతో కలిసి విందు భోజనం అనంతరం రాత్రి 8.40 గంటలకు హస్తినకు తిరుగు పయనం కానున్నారు. నలుగురు ఎంపీలు గెలవడంతో ఉత్సాహంతో ఉన్న బిజెపి నేతలు… అమిత్ షా పర్యటనతో రాష్ట్రంలో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరుగుతుందని చెప్తున్నారు.