అమేథీలో దారుణం.. స్మృతి ఇరానీ అనుచరుడి హత్య

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. అమేథీలో ఆదివారం తెల్లవారుజామున బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు సురేంద్రసింగ్ అనే బీజేపీ నేతను తుపాకీతో కాల్చి చంపారు. జాము పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత స్మృతి ఇరానీకి సన్నిహితుడిగా భావిస్తున్న ఈయన హత్య స్థానికంగా కలకలం రేపింది. బరోలియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ మొదటినుంచి బీజేపీలో క్రియాశీల కార్యకర్తగా పని చేసేవాడు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాన్ని వీడి.. […]

అమేథీలో దారుణం.. స్మృతి ఇరానీ అనుచరుడి హత్య
Follow us

| Edited By:

Updated on: May 26, 2019 | 6:11 PM

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. అమేథీలో ఆదివారం తెల్లవారుజామున బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు సురేంద్రసింగ్ అనే బీజేపీ నేతను తుపాకీతో కాల్చి చంపారు. జాము పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత స్మృతి ఇరానీకి సన్నిహితుడిగా భావిస్తున్న ఈయన హత్య స్థానికంగా కలకలం రేపింది.

బరోలియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ మొదటినుంచి బీజేపీలో క్రియాశీల కార్యకర్తగా పని చేసేవాడు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాన్ని వీడి.. నియోజకవర్గంలో బీజేపీ తరఫున ప్రచారానికి దిగాడు. అమేథీలో స్మృతి ఇరానీకి మద్దతుగా ప్రచారం చేశాడు. ఇంట్లో నిద్రిస్తున్న సురేంద్ర సింగ్‌పై .. దుండగులు కాల్పులు జరపడంతో.. తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు అతన్ని లక్నోలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బరోలియా గ్రామంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.