కరోనా కట్టడికి లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం..అమెరికా చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌచీ
భారత్లో కరోనా విజృంభనపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. పరిస్థితి ఇప్పటికే చేయి దాటిందని చెప్పిన అమెరికా.. లాక్డౌన్ ఒక్కటే కట్టడికి పరిష్కారం అని సూచించింది. దేశంలో తీవ్రంగా వ్యాపిస్తున్న...
భారత్లో కరోనా విజృంభనపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. పరిస్థితి ఇప్పటికే చేయి దాటిందని చెప్పిన అమెరికా.. లాక్డౌన్ ఒక్కటే కట్టడికి పరిష్కారం అని సూచించింది. దేశంలో తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనా సెకండ్వేవ్ను కట్టడి చేయాలంటే వెంటనే కొన్ని వారాల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ పెట్టాలని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ చీఫ్ మెడికల్ అడ్వైజర్, ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ హెచ్చరించారు. కనీసం కొన్ని వారాల పాటు లాక్డౌన్ పెడితే కరోనాను కట్టడి చేయొచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఇండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పారు. కోవిడ్ మార్గదర్శకాలు, కరోనా కట్టడి గురించి ఆయన తాజాగా ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తాసంస్థతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశం కూడా లాక్డౌన్ పెట్టడానికి ఇష్టపడడం లేదంటూనే… అది తప్పమరో మార్గం లేదని చెప్పుకొచ్చారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే అదొక్కటే మార్గమన్నారు ఆంటోని ఫౌచీ.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సైతం భారత్లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ కారణంగా భారత్లో పరిస్థితులు విషాదకరంగా ఉన్నాయని అన్నారు. దీంతో మే 4 నుంచి ఇండియా నుంచి వచ్చే రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. భారత్లో కోవిడ్ ఉధృతి కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.