సైలెంట్ మెజారిటీయే నాకు రక్ష..డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇక సుమారు వంద రోజులు మాత్రమే ఉండడంతో ప్రెసిడెంట్ ట్రంప్ లో ఉత్కంఠ పెరుగుతోంది. తన ప్రభుత్వ విధానాల పట్ల విమర్శలు చేయకుండా తటస్థంగా ఉన్న 'సైలెంట్ మెజారిటీయే'..
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇక సుమారు వంద రోజులు మాత్రమే ఉండడంతో ప్రెసిడెంట్ ట్రంప్ లో ఉత్కంఠ పెరుగుతోంది. తన ప్రభుత్వ విధానాల పట్ల విమర్శలు చేయకుండా తటస్థంగా ఉన్న ‘సైలెంట్ మెజారిటీయే’ తనను ఆ ఎన్నికల్లో గెలిపిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. కరోనా వైరస్ పరిస్థితిని హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యారన్న అప్రదిష్టను మూటగట్టుకున్న ట్రంప్ పై అప్పుడే మూడు రాష్ట్రాల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. ఫ్లోరిడాలో ఈయనకు 46 శాతం మంది మాత్రమే మద్దతు పలకగా ఈయన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ కి 51 శాతం ఓటర్లు జైకొట్టారు. అలాగే ఆరిజోనాలో ట్రంప్ కన్నా బిడెన్ నాలుగు శాతం ఎక్కువ ఓట్లతో ఆధిక్యతలో ఉన్నారు. మిచిగాన్ లో బిడెన్ కి 52 శాతం, ట్రంప్ కి 40 శాతం తమ సపోర్ట్ ప్రకటించారు.
అయితే ఈ ‘ఓటింగ్ సరళిని’ తాను అంగీకరించబోనని ట్రంప్ అంటున్నారు. ఏకంగా ఎన్నికలనే ఫేక్ అనేంత వరకు వెళ్లారు. నవంబరు 3న సైలెంట్ మెజారిటీ ఏం చేయాలో అది చేస్తుంది. ఫేక్ సప్రెషన్ ఎన్నికల వ్యవస్థ అంటూ కొట్టిపారేశారు. మరో 100 రోజుల అనంతరం దేశాన్ని కొత్త పథంలోకి తీసుకువెళ్తానని, విజయమే మన పరమావధి అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక కోవిడ్-19 కారణంగా ట్రంప్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను పరిమితం చేసుకోవడమో, లేక రద్దు చేసుకోవడమో తప్పడంలేదు. ఫ్లోరిడాలో వచ్ఛేనెలలో జరిగే రిపబ్లికన్ల సదస్సు కూడా రద్దయ్యేట్టే ఉంది.