US Gun culture: తెలుగు వాళ్ల ప్రాణాల మీదికొస్తున్న అమెరికా గన్ కల్చర్.. హెచ్చరిస్తోన్న ఎన్నారై సంఘాలు.
యూఎస్లో గన్కల్చర్... తెలుగోళ్ల ప్రాణాల మీదికొస్తోంది. చదువుకోడానికెళ్లిన మనోళ్లు చావును కొనితెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంటోంది. నల్లదొంగలు తెగబడి తెలుగు విద్యార్థుల్ని బలితీసుకుంటున్నారు. చేతికో తుపాకీ చొప్పున అక్కడ చెలరేగిపోతున్న గన్ కల్చర్... ఎన్నారైల బతుకుల్ని..
యూఎస్లో గన్కల్చర్… తెలుగోళ్ల ప్రాణాల మీదికొస్తోంది. చదువుకోడానికెళ్లిన మనోళ్లు చావును కొనితెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంటోంది. నల్లదొంగలు తెగబడి తెలుగు విద్యార్థుల్ని బలితీసుకుంటున్నారు. చేతికో తుపాకీ చొప్పున అక్కడ చెలరేగిపోతున్న గన్ కల్చర్… ఎన్నారైల బతుకుల్ని శాసిస్తోంది. తాజాగా ఓ తెలుగు స్టూడెంట్ బతుకు ఇలాగే తెల్లారిపోయింది. అందుకే… ఇక్కడ నల్లదొంగలున్నారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి ప్రవాస సంఘాలు. పెద్ద చదువులు, ఖరీదైన కొలువుల కోసం అమెరికా ఫ్లైటెక్కుతున్న వారి ఆశలు ఆవిరైపోతున్నాయి. అక్కడున్న వైట్స్ మీదే కాదు… బైటి దేశస్థుల్ని కూడా వదిలిపెట్టడం లేదు బ్లాక్స్. పెచ్చుమీరిపోతున్న తుపాకీ సంస్కృతికి తెలుగు విద్యార్థులు బలైపోతున్నారు.
తాజాగా చికాగోలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తెలుగు విద్యార్థులపై నలుగురు నల్లజాతీయులు దాడి చేశారు. వారి దగ్గరున్న డబ్బు, ఫోన్ లాక్కున్నారు. అడిగినవన్నీ ఇచ్చినా వదిలిపెట్టకుండా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో దెవ్శిష్ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పేరెంట్స్తో మాట్లాడుతుండగానే ఆఖరి శ్వాస విడిచాడు దేవ్శిష్. ఇదొక అంతులేని విషాదం. మరో విద్యార్థి సాయి చరణ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. 10రోజుల కిందటే అమెరికాకు వెళ్లిన సాయిచరణ్కు నల్లజాతీయుల కాల్పుల్లో గాయపడ్డాడని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు తల్లిదండ్రులు.
ఈ ట్రాజెడీ గురించిన విని అమెరికాలో ఉంటున్న తమతమ పిల్లల గురించి ఆందోళనకు గురవుతున్నారు పేరెంట్స్. ఎందుకంటే… అమెరికాలో సిగిరెట్ పాకెట్ కొన్నంత ఈజీగా తుపాకీ కొనెయ్యొచ్చు. ఆత్మరక్షణ కోసం వాడాల్సిన గన్స్ని దోపిడీలకు, హత్యలకు వాడేయ్యడం వాళ్ల అలవాటుగా మారిపోయింది. విచ్చలవిడిగా పెరిగిన తుపాకుల వినియోగంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు అమెరికన్లు. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందన్న వార్తలతో అగ్రరాజ్యంలో ఇటువంటి అఘాయిత్యాలు ఇంకా పెరిగే ప్రమాదముంది. అందుకే… అక్కడున్న తెలుగు విద్యార్థులు, ఉద్యోగులు అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్నాయి ఎన్నారై సంఘాలు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..