అమెరికాలో హైదరాబాద్‌ వ్యక్తి దారుణ హత్య..!

అమెరికాలోని జార్జియాలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే హైదరాబాద్‌వాసిని కిరాతకంగా హత్య చేశారు.

అమెరికాలో హైదరాబాద్‌ వ్యక్తి దారుణ హత్య..!
Follow us

|

Updated on: Nov 03, 2020 | 7:09 AM

America Crime News: అమెరికాలోని జార్జియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉండే హైదరాబాద్‌వాసిని కిరాతకంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చంచల్‌గూడకి చెందిన 37 ఏళ్ళ మహమ్మద్ ఆరిఫ్ మొహియుద్దీన్ గత పదేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. జార్జియాలో గ్రోసరీ స్టోర్స్ నడుపుతున్నాడు. ఆరిఫ్‌కు భార్య, పది నెలల పాప ఉన్నారు. బిజినెస్ పార్టనర్‌తో విభేదాలే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు.

షాపు మూసివేసి అరగంటలో ఇంటికి వస్తానని చెప్పిన తన భర్త… ఫోన్ చేసినా ఎత్తలేదని ఫాతిమా తెలిపింది. స్నేహితుల ద్వారా భర్త మరణవార్త తెలిసినట్టు వెల్లడించింది. భర్తని కడసారి చూసేందుకు అవకాశం కల్పించాలని కోరింది. అంతిమ యాత్రలో పాల్గొనేందుకు ప్రభుత్వం సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ విషయంలో విదేశాంగ మంత్రి జయశంకర్‌, USAలోని ఇండియన్ ఎంబసీ జోక్యం చేసుకోవాలని కోరారు. MBT స్పోక్స్ పర్సన్ అంజద్ ఉల్లాఖాన్‌. ఎమర్జెన్సీ వీసాతో పాటు టికెట్ కూడా ఇప్పించి అంతిమయాత్రలో పాల్గొనే విధంగా తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.