Breaking : గుంటూరులో కరోనా పేషెంట్ల అంబులెన్స్ ను ఢీకొట్టిన లారీ..
గుంటూరు జిల్లాలో కరోనా పేషెంట్లను తీసుకెళ్తున్న 108 అంబులెన్స్ బోల్తా కొట్టింది. గుంటూరు నుంచి మంగళగిరి దగ్గర్లో ఏర్పాటు చేసిన కరోనా స్పెషల్ ఆసుపత్రికి కరోనా పేషెంట్లను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి మంగళగిరి వైపు బయల్దేరిన అంబులెన్స్ను పెదకాకాని గ్రామ శివార్లలో లారీ ఢీకొట్టడంతో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కోవిడ్ పాజిటివ్ రోగులకు గాయాలైనట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రోగులకు ట్రీట్మెంట్ […]
గుంటూరు జిల్లాలో కరోనా పేషెంట్లను తీసుకెళ్తున్న 108 అంబులెన్స్ బోల్తా కొట్టింది. గుంటూరు నుంచి మంగళగిరి దగ్గర్లో ఏర్పాటు చేసిన కరోనా స్పెషల్ ఆసుపత్రికి కరోనా పేషెంట్లను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి మంగళగిరి వైపు బయల్దేరిన అంబులెన్స్ను పెదకాకాని గ్రామ శివార్లలో లారీ ఢీకొట్టడంతో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కోవిడ్ పాజిటివ్ రోగులకు గాయాలైనట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లాలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రోగులకు ట్రీట్మెంట్ అందించేందుకు మంగళగిరి సమీపంలోని ఎన్నారై ఆస్పత్రిని కోవిడ్ – 19 స్పెషల్ ఆసుపత్రిగా మార్చారు. జిల్లాలోని పాజిటివ్ కేసులను అక్కడికే తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తాజగా ఇద్దరు పాజిటివ్ రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో అంబులెన్స్ యాక్సిడెంట్ కు గురైంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.