టీడీపీకి షాక్.. ఆమంచి రాజీనామా
అమరావతి: ఏపీలో అధికార టీడీపీకి మరో షాక్ తగిలింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పంపారు. ఈ ఉదయం తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి.. త్వరలో వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆమంచి పార్టీని వీడుతున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా, పలువురు ముఖ్య నేతలతో ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేశారు. రానున్న ఎన్నికల్లో మంచి అవకాశం […]
అమరావతి: ఏపీలో అధికార టీడీపీకి మరో షాక్ తగిలింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పంపారు. ఈ ఉదయం తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి.. త్వరలో వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
అయితే ఆమంచి పార్టీని వీడుతున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా, పలువురు ముఖ్య నేతలతో ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేశారు. రానున్న ఎన్నికల్లో మంచి అవకాశం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ.. ఆమంచి పార్టీని వీడేందుకే మొగ్గుచూపారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తన నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించారు. త్వరలో జగన్తో సమావేశం అయి ఆ పార్టీలో చేరుతానని ఆమంచి పేర్కొన్నారు. కాగా 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి ఘన విజయం సాధించి.. తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.