వైసీపీలోకి మరో టీడీపీ ఎంపీ
అమలాపురం: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ ఫిరాయింపుదారులు పెరుగుతున్నారు. అధికార టీడీపీ నుంచి ప్రతిపక్ష వైసీపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో టీడీపీ ఎంపీ వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమలాపురం లోక్సభ సభ్యుడు పండుల రవీంద్రబాబు వైసీపీలోకి వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం. రవీంద్రబాబు గత కొంత కాలంగా పార్టీ మారనున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో తాను పార్టీ మారడం లేదని ఆయన ప్రకటించారు. అయితే కొంతకాలంగా రవీంద్ర వైసీపీ నేతలతో […]
అమలాపురం: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ ఫిరాయింపుదారులు పెరుగుతున్నారు. అధికార టీడీపీ నుంచి ప్రతిపక్ష వైసీపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో టీడీపీ ఎంపీ వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమలాపురం లోక్సభ సభ్యుడు పండుల రవీంద్రబాబు వైసీపీలోకి వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం.
రవీంద్రబాబు గత కొంత కాలంగా పార్టీ మారనున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో తాను పార్టీ మారడం లేదని ఆయన ప్రకటించారు. అయితే కొంతకాలంగా రవీంద్ర వైసీపీ నేతలతో చర్చలు జరుపుతూనే ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడో, రేపో వైసీపీ అధినేత వైఎస్ జగన్ను కలనున్న రవీంద్రబాబు.. ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.